మెదడు

                               మెదడు వాపురాకుండా కాపాడుకోవడానికి  -                     19-2-10

       -    ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా చిన్న పిల్లలలో, అరుదుగా పెద్దలలో వస్తుంది.

తులసి ఆకులు              ---- పది
మిరియాలు                   ---- పది
జిలకర పొడి                   ---- రెండు, మూడు చిటికెలు
ధనియాల  పొడి               ----                "
అల్లం                              ---- రెండు గ్రాములు

      అన్నింటిని దంచి రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి ఒక కప్పుకు రానివ్వాలి. దీనిని రెండు పూటలా తాగాలి.  ఇది మెదడు వాపు రానివ్వకుండా కాపాడుతుంది. శక్తిని ఇస్తుంది.

                               మెదడు వాపు--నివారణ                             18-11-10.

       మెదడుకు సరిపడినంత రక్తం సరఫరా కాక పోవడం వలన మెదడు అదుపు తప్పుతుంది. మొద్దుబారినట్లు శరీరంలోని అన్ని భాగాలు పని చేయనట్లు, కదిలించలేనట్లుగా తయారవుతాయి.

  ఇది చాలా తీవ్రమైన వ్యాధి.

చందనాది వటి
బిల్వాది వటి
రస సింధూరం
చందనాది తైలం
బిల్వాది తైలం

       పై వానిలో ఏదో ఒక దానిని వాడవచ్చు.

తిప్ప తీగ పొడి             --- 50 gr    వెంటనే  ఈ పొడిని గాని లేదా దీని కషాయాన్ని గాని  ఇస్తే తీవ్రత తగ్గుతుంది.
శతావరి వేర్ల పొడి         --- 50 gr
నేలవేము మొక్క పొడి --- 50 gr
ఎర్ర చందనం పొడి        --- 50 gr
వంశ లోచనం             ---- 50 gr  ( వెదురుప్పు )
సోమిడి చెక్క పొడి      ----  50 gr  ( సోమింత = మాంస రోహిణి )

        అన్నింటిని విడివిడిగా దంచి  చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

        పూటకు ఒక టీ స్పూను పొడి చొప్పున ఉదయం, మధ్యాహ్నం,  రాత్రి తేనెతో కలిపి తీసుకోవాలి.    లేదా బటాణి  గింజంత మాత్ర వాడాలి.

        ఇది జ్వర తీవ్రతను,  నొప్పులను తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి